దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ, జనవరి 29 (): రాజీవ్‌ యువకిరణాల పథకం కింద నిరుద్యోగ యువకులకు చింతపల్లిలో సెక్యూరిటీ గార్డ్స్‌లో ట్రైనింగ్‌ ఇవ్వనున్నట్లు ఎపీఎం అశోక్‌ తెలిపారు. 10వ తరగతి పాసై, ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా నల్లగొండ మహిళా ప్రాంగణంలో టైలరింగ్‌ లోనూ, ఈడబ్ల్యూఆర్‌సి కంప్యూటర్‌ కోర్సుకు రామానంద తీర్థ గ్రామీణ యునివర్శిటీ నందు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాల కోసం అనుముల, పెద్దవూర మండలాల జాబ్‌ రిసోర్స్‌పర్సన్‌ యశ్వంత్‌ను సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 9848302573కి ఫోన్‌ చేయాలన్నారు.