దళితబంధు పథకం కాదు…ఓ ఉద్యమం

దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం
రైతుబంధు లాగా దీనిని కూడా విజయవంతం చేస్తాం
దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి
ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డవిూది నుంచే ప్రారంభించి వజయవంతం చేసాం
ఈ సెంటిమెంట్‌ దళితబంధును కూడా విజయవంతం చేస్తుంది
యావత్‌ ప్రపంచానికి ఇదొక దిక్సూచి కానుంది
హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్‌
హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): దళితబంధు ఓ పథకం కాదని..ఇది ఓ ఉద్యమమని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. ఇది ఆషామాషీగా ప్రకటిస్తున్నది కూడా కాదన్నారు. ఈ పథకం దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలవబోతున్నదని అన్నారు. దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ’దళిత బంధును విజయం సాధించితీరుతుందన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా శాలపల్లి వేదికపై భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్ర పటాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. గతంలో రైతుబంధు లాగా ఈ పథకం కూడా విజయం సాధించి అందరికీ చేరుతుందన్నారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. ’ఇదే వేదిక నుంచి రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రైతు బంధు కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా నడుస్తున్నది. వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. తెలంగాణ రైతాంగంలో ధీమా పెరిగింది. కరీంనగర్‌ పట్టణంలో జరిగిన సభలో రైతుబీమా ప్రకటించాను. ఆ స్కీం అద్భుతంగా కొనసాగుతోంది. తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ జిల్లా తెలంగాణ సాధనలో తొలిసింహగర్జన నుంచి నేటి వరకు కూడా సెంటిమెంట్‌గా బ్రహ్మాండమైన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరే వేదికగా మారింది. ఈ క్రమంలోనే ఈ జిల్లా నుంచే అద్భుతమైన ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాను. మహనీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్రామ్‌కు పుష్పాంజలి ఘటించి శ్రీకారం చుడుతున్నాం.’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. దళితబంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించి నప్పుడు చాలా అనుమానాలు, అపోహాలు ఉండేవి. విూ అందరి దీవనెలతో రాష్ట్రం నలుమూలుల ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగి 14, 15 సంవత్సారల కృషి తర్వాత రాష్టాన్న్రి సాధించుకున్నాం. ఇవాళ సగర్వంగా దీవిస్తున్నారు. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించాం. ప్రతి రోజు ప్రతి నిత్యం విూ కండ్లముందు గ్రామాల్లో, మండలాల్లో, విూ అనుభవంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిన్ననే 75వ స్వాతంత్య దినోత్సవం జరుపుకున్నాం. ఈ 75 ఏండ్లలో భారతదేశంలో ప్రధాని, పార్టీ కానీ దళిత కుటుంబాలను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా? కనీసం వాళ్ల మైండ్‌కైనా వచ్చిందా? ఆ దిశగా ఆలోచన చేసిండ్రా? చేయలేదు. ఈ పథకం
ఏడాది కిందనే మొదలుకావాలి. కానీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వలేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. పక్కన బాంబులు పడ్డట్టు భయపడుతుండ్రు. దళితులు బాగుపడొద్దా. ఎవరెవరకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతకు మనవి చేస్తున్నా. ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత విూ విూదనే ఉంది’ అని సీఎం తెలిపారు. మొత్తం మంత్రివర్గం, పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరపున నూటికి నూరు శాతం విజయవంతం చేస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ హావిూ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో మహోత్తరమైన, కొత్త చరిత్రను సృష్టించే, తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందటానికి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నానని అన్నారు. తాను ఈ పథకం ప్రారంభించగానే కొందరు అపశకునం మాటలు మాట్లాడారని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపిఉల, ఎమ్మెల్యేలు, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.