దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ

పినపాక నియోజకవర్గం జూలై 14 (జనం సాక్షి): గోదావరి వరదలో చిక్కుకున్న అన్నారం, రాయిగూడెం, రామ్ నగర్ గ్రామస్తులకు సింగరేణి యాజమాన్యం సహకారంతో దానధర్మా ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు దినపత్రిక సీఎం డి గంటా రాధా పునరా వాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు భోజనం మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వరద ఉధృతికి నీట మునిగటం వల్ల వండుకునే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎటు  వెళ్లాలన్న నీటితో రోడ్లన్నీ మునిగిపోయి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఆకలితో అలమటిస్తున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న దానధర్మా ట్రస్టు సభ్యులు భోజనాలు మంచినీటి పంపిణీ చేసే మానవత్వాన్ని చాటుకున్నారు.సేవా కార్యక్రమంలో  కమలాపురం యూత్ ప్రశాంతు, నరేష్, సంతోష్, పవన్ ,ప్రభాకర్ ప్రవీణ్ ,వెంకటేష్ ,నవీన్ శెట్టి ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.