దారుర్ జాతరను సందర్శించి ప్రార్ధనలు చేసిన జడ్పీటీసీ స్వప్నభాస్కర్

వికారాబాద్ జిల్లా, దారుర్ మండల కేంద్ర సమీపంలో ప్రతి సంవత్సరం జరిగే..దక్షిణ భారతదేశంలోనే క్రైస్తవుల అత్యంత నమ్మకం,భారీ జాతరగా పేరు గాంచిన  దారుర్ 100వ జాతర  కార్యక్రమంలో పాల్గొని ప్రార్ధనలు చేసిన న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా ఎంతో నమ్మకం కలిగి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ప్రార్ధనలు చేసిన వారందరి కోరికలు నెరవేరాలని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభోదించిన శాంతియూత సన్మార్గంలో నడవాలని,ప్రతి ఒక్కరూ సుఖాసంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు.కార్యక్రమంలో సర్పంచ్ లు విజయ్,తిమోతి,రాజు,మాజీ సర్పంచ్ స్వామిదాస్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు జైరాజ్, రామ్ చందర్,జాన్,విల్సన్ తదితరులు పాల్గొన్నారు