దుర్గమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ..

ధూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 28 : ధూల్మిట్ట మండలం  వీరభైరన్ పల్లి గ్రామంలో బుధవారం దుర్గమ్మ గుడికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ  గిరికొండల్ రెడ్డి, ఎంపీటీసీ నర్సింలు ,సర్పంచ్ బండి శ్రీనివాస్, వార్డు సభ్యులు పులి పోశయ్య, శ్రీకాంత్, ఉప్పలయ్య, గ్రామ యువకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.