దోభీఘాట్‌ నిర్మాణం పూర్తిచేయాలి

భువనగిరి: పట్టణంలో రూ.3లక్షలతో చేపట్టిన దోభీఘాట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రజకులు మంగళవారం సబ్‌కలెక్టర్‌ దివ్వకు వినతి పత్రం సమర్పించారు. అసంపూర్తిగా ఉన్న నిర్నాణాన్ని పూర్తిచేయటకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు.