ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న పాలవ్యాన్‌: ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరనిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబంలోని ముగ్గురు దుర్మరాణం చెందారు. మహబూబ్‌నగర్‌ మండలం అప్పనపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మద్దూరు మండలం వీరారం గ్రామానికి చెందిన కొండయ్య(34), శ్రీశైలమ్మ(29), నరేశ్‌(5)లు ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఉప్పల్‌ నుంచి మహబూబ్‌నగర్‌వైపు వెళ్తున్న పాలవ్యాన్‌ కొండయ్య ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంతో పాటు పాలవ్యాను పక్కనే ఉన్న లోయలో పడిపోయాయి. ప్రమాదంలో కొండయ్య అతని భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాను డ్రైవర్‌ వినోద్‌కుమార్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటనాస్థలాన్ని మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. కుటుంబనికి సమాచారం అందించి శవాలను ఆస్పత్రికి తరలించారు.