నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో స్వచ్ఛతా రన్.

నెన్నెల, నవంబర్ 19, (జనంసాక్షి )
మండలంలోని నందులపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో శనివారం వరల్డ్ టాయిలెట్ డే సందర్బంగా స్వచ్ఛతా రన్ నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఇంటికి నిర్మాణంలో వీటికి ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇంటి మురుగు నీరు బయటకు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమాల్లో గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ , నందులపల్లి సర్పంచ్ బోయిని మల్లేష్, పంచాయతీ కార్యదర్శులు పద్మనాభం, రంజిత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.