నర్సాపూర్ కోర్టు నూతన భవాని నిర్మాణానికి కృషి చేస్తా

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి
నర్సాపూర్ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టు నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి అన్నారు బుధవారం
ఇటీవల నర్సాపూర్ డివిజన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నేలకూలిన నర్సాపూర్  మున్సిఫ్  మెజిస్ట్రేట్ కోర్ట్ భవనాన్ని  మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి సందర్శించి పరిశీలించారు అనంతరం నర్సాపూర్ ఐబి అతిథిగృహంలో కొనసాగుతున్న తాత్కాలిక  కోర్టును   సందర్శించారు మున్సిఫ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిత తో మాట్లాడారు,ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ నూతన కోర్టు భవన నిర్మాణం కోసం ఉన్నతాధికారులతో చర్చిస్తానని  ఆమె తెలిపారు   నూతన కోర్టు భవన నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమి అవసరం ఉన్నందున స్థలం కోసం అధికారులు  పరిశీలించాలన్నారు, నూతన  భవన నిర్మాణానికి 5.5 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని సునీతా రెడ్డి తెలిపారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నహిముద్దీన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిరెడ్డి న్యాయవాదులు సత్యనారాయణ శ్రీనివాస్ ప్రకాష్ జాఫర్ అలీ టిఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్ తదితరులు ఉన్నారు,