నల్గొండలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఆందోళన

నల్గొండ : ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ నియామక పరుగు పరీక్షకు అనుమతించకపోవడానికి నిరసిస్తూ అభ్యర్థులు కలెక్టర్‌ నివాసం ముందు ఆందోళనకు దిగారు. రెండు నెలలలపాటు సాధన చేసినా తమను అనుమంతించకపోవడంపై నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు.