నల్గొండలో తండాకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నల్గొండ: మిర్యాలగూడ మండలంలోని కొన్వానాయక్‌తండాకి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం గమనార్హం. విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో కోతకొచ్చిన వరి చేలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రేపటిలోగా  విద్యుత్‌  సరఫరా పురరుద్ధరించకపోతే వరి పంటను తగలబెడతామని రైతులు ఆవేదనతో తెలియజేశారు.