నల్గొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘర్షణ

నల్లగొండ: చౌటుప్పల్‌ మండలంలోని డిస్కవరీ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ సూపర్‌వైజర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యంలో కలుపుకునేందుకు నీరు ఇవ్వలేదని.. సురేందర్‌ అనే సూపర్‌వైజర్‌ను.. బీహార్‌కు చెందిన మరో సూపర్‌వైజర్‌ తలపై బండరాయితో మోదాడు. దీంతో తీవ్రగాయాలైన సురేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నెల్లూరు జిల్లావాసిగా గుర్తించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.