నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

జహీరాబాద్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల, విశ్వనరుడు గుర్రంజాషువా అని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మాతంగి చిరంజీవి అన్నారు.బుధవారం జాషువా 127వ జయంతి వేడుకలను జహీరాబాద్ ఎమ్మార్పియస్ కార్యాలయంలో అబ్రహం మాదిగ ఎమ్మార్పియస్ జహీరాబాద్ నియోజకవర్గ మాజీ ఇంచ్చార్జీ ఆద్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా. తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువాతో సరి పోల్చదగిన కవులు ఇప్పటికీ జన్మించలేదంటే అది అతిశయోక్తి కాదనీ ఆయన అన్నారు. అబ్రహాం మాదిగ మాట్లాడుతూ గుర్రం జాషువా రచనలను ప్రాపంచిక భాషలలోకి తర్జుమా చెయ్యాల్సిన అవశ్యకత ఖచ్చితంగా ఉందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పియస్ నాయకులు జైరాజ్,రాజు,మధు,బబ్లు,కిట్టు,అజయ్,సుకూమార్,ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు