నాగర్ కర్నూల్ ప్రతినిధి న్యూస్-1

క్రమ అరెస్టులతో ఆదారాలను దాచిపెట్టలేరు.                                  బిజెపి మండలాధ్యక్షులు పధిర భీమేష్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జూన్8.(జనం సాక్షి):
అక్రమ అరెస్టులతో ఆదారాలను దాచిపెట్టలేరని పెద్దకొత్తపల్లి బిజెపి మండలాధ్యక్షులు పందిరి భీమేష్ అన్నారు. బిజెపి ఎమ్మెల్యే రఘనందన్ రావు పై పెట్టిన అక్రమ కేసును ఎత్తి వేయాలంటూ బుధవారం మండల కేంద్రంలో నిరసన చెప్పటబోతున్న మిమ్మల్ని పోలీసులు అన్యాయం గా  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లో లా అండ్ ఆర్డర్ నిద్రపోతుందని, మైనర్ బాలికపై హత్యాచారం చేసిన నిందితులను వదిలేసి కీలక ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు  పైన కేసు చేయడం నిజంగా ప్రజాస్వామ్యనికి విరుద్ధం అని తెలిపారు.పోలీస్ వారికీ విషయాలు అన్ని తెలుసు అని, ఎంఐఎం నాయకలకు తోత్తులుగా పోలీస్ లు వ్యవహారించడం నిజంగా బాధాకరమని పేర్కొన్నారు.
అరెస్టు అయిన వారిలో బిజెపి పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు పదిరి బీమేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెరుగు రాజు,మద్దిలేటి, శివ, సాయి, మల్లేష్ తదితరులు ఉన్నారు