నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

నిజామాబాద్: వర్ని మండలం చందూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దంపతులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి గాయపర్చి 3 తులాల బంగారం, రూ.20వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.