నిజాయితీగా నిలిచిన యువకుడు

రహదారిపై తనకు దొరికిన పర్సు, నగదు
రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఎస్ఐ సమక్షంలో బాధితునికి పర్సు, నగదు అందజేత.

బూర్గంపహాడ్ జూలై 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ శివారు నందు ఉన్న రాష్ట్రీయ రహదారిపై ఓ యువకునికి దొరికిన పర్సు నగదును నిజాయితీగా పోగొట్టుకున్న వ్యక్తికి శనివారం అందజేశారు. నాగినేని ప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని గోమ్మూరు కాలనీకి చెందిన బూరం ముత్యాలరావు రోజు భద్రాచలం జిసిసిలో డ్రైవర్గా పనిచేసేందుకు వెళుతుండగా నాగినేని ప్రోలు మార్గమధ్యమంలో నగదుతో కూడిన పర్సు దొరకటంతో స్థానిక రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డి కి సమాచారం అందించారు, అతని సహకారంతో పర్సు పోగొట్టుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా నందిగామ గ్రామానికి చెందిన రాసూరి సాయి ప్రకాష్ గా గుర్తించి, అతనికి సమాచారం అందించి ఎస్సై దారం సురేష్ సమక్షంలో నగదు గల పర్సు అందజేసి నిజాయితీని చాటుకున్నారు. ఈ సందర్భంగా అతనిని ఎస్సై సురేష్ అభినందించారు, ఆయనతోపాటు పలువురు పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు అభినందించా