నితన్‌ మరిన్ని విజయాలు సాధించాలిఐ దిల్‌రాజు

నితిన్‌, కృతీశెట్టి జంటగా ఎడిటర్‌ ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ’మాచర్ల నియోజకవర్గం’. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్‌ 12న విడుదలవుతోంది. కేథరీన్‌ థ్రెసా మరో హీరోయిన్‌. అంజలి స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ’రా రా రెడ్డి’ అంటూ సాగే ఈ పాటను దిల్‌ రాజు లాంచ్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ’జయంతో మొదలైన నితిన్‌ ప్రయాణం ఇరవై ఏళ్ళు పూర్తయింది. అతను మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలి’ అంటూ టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. నితిన్‌ మాట్లాడుతూ ’అభిమానులు ఎప్పుడూ మాస్‌ సాంగ్స్‌ చేయమని అడుగుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్‌ నెంబర్స్‌ పెట్టాం. లిరికల్‌ వీడియోలో ఉన్నది శాంపిల్‌ మాత్రమే సినిమాలో పాట అదిరిపోతుంది. ’జయం’లో రానురాను పాటను రిపీట్‌ చేయడం చాలా స్పెషల్‌గా అనిపించింది’ అన్నాడు. ’నితిన్‌ ఎక్స్‌ప్రెసీవ్‌ డ్యాన్సర్‌. ఆయన డ్యాన్స్‌ చేసినప్పుడు బాడీతో పాటు ఫేస్‌ కూడా డ్యాన్స్‌ చేస్తుంది. ఒక నటుడికి ఉండాల్సిన గొప్ప క్వాలిటీ అది. నా ఫేవరెట్‌ సాంగ్‌ ఇది. అంజలి పాటలో అందంగా కనిపిస్తుంది’ అంది కృతీశెట్టి. ’నితిన్‌ పక్కన డ్యాన్స్‌ చేయడం అంత తేలిక కాదు. పాట చివర్లో రానురాను అనే పల్లవి రావడం ఇంకా జోష్‌ని నింపింది’ అని చెప్పింది అంజలి. ఈ
సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నాడు దర్శకుడు. నిర్మాత నికితా రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్‌, లిరిక్‌ రైటర్‌ కాసర్ల శ్యామ్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.