నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

(జనం సాక్షి) జూలై 14 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఎల్లపాగ  బొక్కలయ్య గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతు గత నాలుగురోజుల క్రితం షుగర్ లెవల్స్ పెరిగి అనారోగ్యానికి గురి కావడంతో ముందుగా వనపర్తి హాస్పిటల్ లో చేర్పించిన సందర్భంగా జూపల్లి కృష్ణారావు చొరవతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా గురువారం  నిమ్స్ ఆస్పత్రికి మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు  వెళ్లి బాధితుని పరామర్శించారు.వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వైద్యులతో మాట్లాడి వీలైనంత త్వరగా మెరుగైన వైద్యం అందించాలని   జూపల్లి కృష్ణారావు, వైద్యులకు సూచించారు.వారితో పాటు కుటుంబ సభ్యులు మరియు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.