నిర్మాణ పనులను నాణ్యత గా చేపట్టాలి…… డి.ఈ. చెన్నయ్య

 మనఊరు-మనబడి అభివృద్ధి పనులను డి. ఈ. చెన్నయ్య, ఎం ఈ ఓ లక్ష్మణ్ నాయక్, ఏ ఈ సత్యం సంయుక్తంగా పరిశీలించారు.
 పానుగల్ మండలంలోని మనఊరు-మనబడి కి ఎంపికైన చింతకుంట,మహముదాపూర్,బుసిరెడ్డి పల్లి, శాఖాపూర్ ప్రాథమిక పాఠశాలల్లో మనఊరు-మనబడి అభివృద్ధి పనులను పరిశీలించి, పనులను నాణ్యత గా చేపట్టాలని ఆదేశించారు. అనంతరం బుసిరెడ్డి పల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచు,ఎంపీటీసీ, చెర్మన్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.