నీటి చౌర్యానికి పాల్పడుతున్న కర్ణాటక : ఎంపీ జితేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 16 : కర్ణాటక ప్రభుత్వం నీటి చౌర్యానికి పాల్పడుతోందని పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఆయా ప్రాజెక్టుల నిర్మాణం జరుపుతోందని, దీనిపై కేంద్రమంత్రి ఉమాభారతికి ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా… ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని అడ్డుకోకుండా రాజకీయ లబ్దికోసమే ప్రాజెక్టుల యాత్ర చేస్తోందని ఆయన పేర్కొన్నారు