నీటి సమస్యపై మేయర్ సమీక్ష

బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో నీటి సమస్యపై వాటర్ బోర్డు మేయర్ సామల బుచ్చిరెడ్డి సమావేశమయ్యారు. ప్రతి డివిజన్ నుండి వివిధ నీటి సమస్యల జాబితాను కార్పొరేటర్ల నుండి తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, సీసా వెంకటేష్, సుమన్ నాయక్, సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, కొత్త చక్రపాణి, జక్కల రాములు, గుర్రాల వెంకటేష్, సిజిఎం అమరరేందర్ రెడ్డి, డైరెక్టర్ స్వామి, జీఎం శ్రీనివాస్ రెడ్డి, డిజీఎం కార్తిక్ రెడ్డి, మేనేజర్ మమత తదితరులు పాల్గొన్నారు.