నూతన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ కమిటీ ఎన్నిక

ఎల్లారెడ్డి 10 సెప్టెంబర్ జనంసాక్షి (టౌన్)
ఎల్లారెడ్డి మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం నాడు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో మండల అధ్యక్షులుగా మంత్రి వెంకటయ్య, ఉపాధ్యక్షులుగా ఏ సాయిలు, ఎల్ మాన్య, ప్రధాన కార్యదర్శిగా కే సవాయిసింగ్, కోశాధికారిగా జి జ్ఞానేశ్వర్,కార్యదర్శిగా రాందాస్,మహిళా అధ్యక్షురాలుగా అనిత దేవి లను ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కొంగల వెంకట్, జిల్లా అధ్యక్షులు బి ప్రవీణ్ నాయక్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మెగావత్ కనిరాం, కే దాసిరామ్, మానస, రాజమణి, సంతోషి కుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.