నూతన మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నిక..

మండల అధ్యక్షులుగా ముల్క మురళి
కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / ఆదివారం మండల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల మహాసభ అధ్యక్షుడు ముల్క మురళి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.దీనిలో భాగంగా 2022 సెప్టెంబర్ 15న జరిగిన మండల మహాసభ (సిఐటియు అనుబంధం) లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని (18- 09-22) న తీర్మానించి నందున ఆదివారం సమావేశమై నూతన కార్యవర్గాన్ని రహస్య బ్యాలెట్ ద్వారాఎన్నుకోవడం జరిగింది.మరో మారు అధ్యక్షులుగా ముల్క మురళి,ఉపాధ్యక్షులుగా నెలకూర్తి ఉప్పలయ్య, ముప్ప పెద్ద రవి, ఎడెల్తి మల్లేశం,ప్రధాన కార్యదర్శిగా గుంజపొడుగు శ్రీనివాస్,సహాయ కార్యదర్శులుగా పోగుగంటి రామ్మూర్తి, దుంపల రాజయ్య, మాచర్ల సత్యనారాయణ, కోశాధికారిగా ఏదునూరి శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులుగా నగేష్,జల్లంపల్లి శ్రీనివాస్,బొంత సంపత్, బోడ వీరు,బి సాంబశివరావు, దాసరి ఎల్లయ్య, ఎస్కే పాషా, జీ వీరోజి,అల్లి అశోక్, ఎస్.కె పాషా, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ముల్క వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.