నెన్నెలలో సామూహిక గీతాలపన.
ఫొటో రైటప్: నెన్నెలలో గీతాలపన చేస్తున్న ఎంపీపీ రమాదేవి.
బెల్లంపల్లి, ఆగస్టు16, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు జాతీయ గీతాలపన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఎంపీపీ సంతోషం రమాదేవి మాట్లాడుతూ దేశ ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11-30 నిమిషాలకు సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో, అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.