నేటి నుంచి 23వరకు రాష్ట్రస్థాయి ఎండ్ల పందేలు

వేపలసింగారం(హుజూర్‌నగర్‌ రూరల్‌), జనంసాక్షి: మండలంలోని వేపలసింగారం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా నేటి నుంచి 23 వరకు రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు రామాలయ కమిటీ ఛైర్మన్‌ గొంగిరెడ్డి నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పోటీలు జత పళ్లు, టచ్‌పళ్లు, నాలుగు పళ్లు, ఆరు పళ్లు, సేద్యం, స్థానిక సైజు వరుస క్రమంలో పందేలు ఉంటాయన్నారు. నేటి రాత్రి 8 గంటలకు గ్రామంలో బల్పూనూరి పిచ్చిరెడ్డి జ్ఞాపకార్థం రామలయ కమిటీ సౌజన్యంతో శ్రీ కల్యాణి సప్తస్వర నాట్యకళామండలి ఆధ్వర్యంలో సత్యహరిశ్చంద్ర పద్య నాటకం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.