నేడు స్వాతి పూజ

నల్గొండ, ఫిబ్రవరి 2 (): శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శతమటాభిషేకం నిర్వహిస్తారు. శ్రీ స్వామి జన్మదిన నక్షత్రం స్వాతి సందర్భంగా ఆదివారంనాడు వేకువ జామున స్వయంభువులకు ఈ ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. సుప్రభాత ముగిపాక చేపట్టే శతమాటాభిషేకం రెండున్నర గంటల పాటు కొనసాగుతుందని ఆచార్యులు తెలిపారు. రాత్రికి స్వాతిసేవను నిర్వహిస్తారు. అనుబంధంగా గల పాతగుట్ట ఆలయంలోనూ స్వాతి వేడుకలు చేపడతారు.