నేను భయపడే వ్యక్తిని కాను ….. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో చెప్పమని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే మీ ఎంపీ ముందుంటారని ఆయన విమర్శించారు. రెవెన్యూ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. 2014 వరకు ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని సీఎం అన్నారు.