నేరడ కేజీబీవీ విద్యాలయ సందర్శన

-ఎస్ఎఫ్ఐ కురవి మండల కమిటీ
– రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు
కురవి జూలై -16 
(జనంసాక్షి న్యూస్)
కురవి మండలం నేరడ గ్రామంలోని కేజీబీవి హాస్టలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు ఆధ్వర్యంలో శనివారం సందర్శించడం జరిగినది.ఈ సందర్భంగా విద్యార్థులతో హాస్టల్ విషయములు, యోగక్షేమములు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ సౌకర్యములు, ఆహార పదార్ధముల వివరములు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి హాస్టల్ లో  బోజన  చేయడం జరిగిందని  తెలియజేశారు. హాస్టల్ లోని  రూమ్ లన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  మరిపెడ డివిజన్ కార్యదర్శి జ్యోతి బస్, మండల అధ్యక్షులు వీరేందర్, మహేష్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.