పట్టణ ప్రగతి లో బాగంగా ప్రతి వార్డును సందర్శిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ టౌన్ జూన్ 8 ( జనంసాక్షి )
 కోదాడ పట్టణంలో ఈ నెల 3వ తేదీ నుండి 18తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ ప్రగతిలో బాగంగా బుధవారం 02,14,28,32వార్డు ల్లో పర్యటిస్తూ 32వవార్డులో ఉన్నటు వంటి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరిశుభ్రతలో పాల్గొని స్కూల్ అవరణలో ఉన్నటు వంటి మొక్కలకి పాదులు చేపించి నీరు పోయించారు.పట్టణ ప్రగతిని నిరంతర కార్యక్రమంగా మలిచి పట్టణంలో నిత్యం చెత్త సేకరణ,నాటిన ప్రతి మొక్కకు సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం  అక్కడ ఉన్న కూలీలతో మాట్లాడి వారికి సౌకర్యాల గురించి ఆరాతీశారు.కోదాడ పట్టణంలో మున్సిపల్ పాలక మండలి మరియు శాసన సభ్యులు బోల్లం మల్లయ్య యాదవ్ సహకారాలతో పలు అంశాలపై చర్చించి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నామని,రాష్ట్రంలోనే మన మునిసిపాలిటీ నీ మొదటిస్థానంలో ఉంచుతము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రెడ్డి,డిఈ రమాదేవి,వార్డు కౌన్సిలర్స్ కమధన చంద్రశేఖర్,సూర్యనారాయణ  మరియు సంబధిత అధికారులు నాయకులు పాల్గొన్నారు .