పట్టణ ప్రజలను చల్లంగా దీవించు కోట మైసమ్మ తల్లి.

 

 

మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్.
తాండూరు జులై 17(జనంసాక్షి)

పట్టణ ప్రజలను చల్లగా దీవించాలని కోట మైసమ్మ తల్లి ని
మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ అమ్మవారిని వేడుకున్నారు.ఆదివారం
తాండూర్ పట్టణం పాతతాండూరు లో కోట మైస్సమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపులు పట్టణ ప్రజల పై ఎల్లవేళలా ఉండాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అమ్మవారు తన చల్లని దీవెనలు కలగాలని అమ్మవారిని కోరారు.
టిఆర్ఎస్వి జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ, గణేష్ నిబల్కర్, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు అయ్యా, కార్యకర్తలు యువకులు పాల్గొన్నారు.అదేవిధంగా మినీ టాంక్ బండ్ పై కట్ట మైసమ్మ దేవాలయం లో మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. మణపురం రాము కౌన్సిలర్ అధ్వర్యంలో బోనాలు సందర్భంగా దర్శనం చేసుకున్నరు, తదితరులు పాల్గొన్నారు.