పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల బాలికలు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం స్థానిక మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల బూర్గంపహాడ్ గర్ల్స్ వన్ నందు పదవ తరగతి ఫలితాలలో బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించారు. 38 మంది విద్యార్థినులకు గాను 37మంది విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాలు సాధించిన వారిలో బేగం, నసీమా లు 9.8 గా ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో శైలజ 9.7, సునయనజ, సనా, సుహానా, రుక్సార్, సుల్తానాలు నిలిచారు. వీరికి పాఠశాల ప్రిన్సిపాల్  పి.వి గీతా జ్యోతి, కో ఆర్డినేటర్ ఎం.ఏ ఫర్హీన్ బేగం, పాఠశాల అధ్యాపక బృందం పుష్పగుచ్చాలతో విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలియజేశారు