పనులను నాణ్యతగా చేపట్టాలి…..ఎంఈవో లక్ష్మణ్ నాయక్

మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు   ఎం.ఈ.ఓ. లక్ష్మణ్ నాయక్,ఏ.ఈ.సత్యం గారు అభివృద్ధి పనులను పరిశీలించారు.

 పానుగల్ మండలంలోని మనఊరు-మనబడి కి ఎంపికైన బుసిరెడ్డి పల్లి మరియు భగత్ సింగ్ నగర్ కేతేపల్లి ప్రాథమిక,ఉన్నత పాఠశాలల్లో  అభివృద్ధి పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో  శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుంది కావున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, చెర్మన్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.