*పల్లె ప్రగతి తో గ్రామాల అభివృద్ధి. * జెడ్పిటిసి గొర్రె సాగర్ .

చిట్యాల 4(జనం సాక్షి )పల్లె ప్రగతి తో మరింత గ్రామాభివృద్ధి జరుగుతుందని జెడ్పిటిసి గొర్రె సాగర్ అన్నారు. శనివారం మండలంలోని చల్లగరిగ, జూకల్, తిరుమలపూర్, చిట్యాల గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో  జడ్పిటిసి గొర్రె సాగర్ మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ రెండవ రోజు పాల్గొని సోప్ కిడ్స్, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలు, పట్టణాలు రూపురేఖలు మార్చడమే సంకల్పంగా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగేసిందని,నిర్దేశించిన మేర పనులు చేపట్టడంతో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి. పల్లె ప్రగతి  కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామయ్య, సర్పంచులు కర్రే మంజుల అశోక్ రెడ్డి, పుట్టపాక మహేందర్, హజ్ర బేగం, పూర్ణచందర్రావు, చిట్యాల ఎంపిటిసి కట్కూరిపద్మనరేందర్, మండల కోఅప్షన్ ఎండీ రాజ్మహమ్మద్,ఏపివో  అలీమ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సిబ్బంది   తదితరులు పాల్గొన్నారు.