పల్లె ప్రగతి లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి*

పానగల్ జూన్ 14 (జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి  అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు స్పెషల్ ఆఫీసర్ సురేష్ కుమార్ షాగాపూర్ తండా లోని  పల్లె ప్రగతి అభివృద్ధి పనులను సందర్శించారు.  పల్లె ప్రగతి లో అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో ప్రతి ఒక్కరు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే అమలు చేస్తామని వారన్నారు.వారు గ్రామంలో తిరుగుతూ గ్రామంలో ఉన్నా  సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన సందర్భంగా  ప్రతి ఒక గ్రామం అభివృద్ధి చెందే విధంగా మనమందరం కృషి చేయాలని వారన్నారు. అదే  విధంగా తాండ ప్రాథమిక పాఠశాలను ,అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థిని విద్యార్థుల తో ముచ్చటించారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, ఏపీవో కురుమయ్య, ఉపాధ్యాయులు సిరాజ్ ,రవికుమార్, గ్రామ సర్పంచ్ వారితో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .
Attachments area