పాఠశాలలో వార్షిక తనిఖీ

చిలుకూరు: చిలుకూరు మండల కేంద్రంలోని జగ్జీవన్‌ రాంనగర్‌లో పీఎన్‌ పాఠశాల వార్షిక రికార్డులను ఎంఈఓ ఎన్‌. ఈశ్వరరావు తనిఖీ చేసినట్లు సోమవారం తెలిపారు. పాఠశాలలో స్కూల్‌ గ్రాంట్‌ ఎల్‌ ఈపీ. గ్రేడింగ్‌, అడ్మిషన్‌ దరఖాస్తులు, క్యాష్‌ బుక్కులతో పాటు 35 రికార్డులను తనిఖీ చేశారన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉషారాణి ఉన్నారు.