పాడి అభివృద్ధికి కృషిచేయాలన్న పశువైద్యాధికారి

చిలుకూరు: పాడి అభివృద్ధికి రైతులు పశువైద్యాధికారుల సలహాలతో పాల ఉత్పత్తిని పెంచాలని పశువైద్యాధికారి పెంటయ్య అన్నారు. శనివారం రామాపురం గ్రామంలో జరిగిన రైతు చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. రైతులు విత్తన శుద్ధి చేసుకొని వరినారు పోసుకోవాలని మండల వ్వవసాయాధికారి అందె సతీష్‌, రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.