పాలమూరులో 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన

పాలమూరు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఒకేసారి 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. పట్టణంలోని అన్ని డ్యాన్స్ స్కూల్స్, పాఠశాలలు నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థుల నృత్యప్రదర్శన ఎంతో బాగుందని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.