పా రంజన్‌తో విక్రమ్‌ సినిమా

విక్రమ్‌ అనారోగ్యంతో ఇటీవలే కోలుకుని మళ్లీ నార్మల్‌గా షూటింగ్‌లపై దృష్టి పెట్టాడు. తనకేం కాలేదని విక్రమ్‌ చెప్పడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. విక్రమ్‌ కూడా ఎప్పటిలా సూపర్‌ స్పీడ్‌లో వర్క్‌ చేసుకుంటూ పోతున్నాడు. ఈ నెలలో ’కోబ్రా’, వచ్చే నెలలో ’పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్రమ్‌.. రీసెంట్‌గా పా.రంజిత్‌తో పని చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమా గురించి ఓ ఇంటరెస్టింగ్‌ న్యూస్‌ తెలిసింది. ఇది 1800 కాలానికి చెందిన కథట. త్రీడీ ఫార్మాట్‌లో తీయబోతున్నారట. ఈ నెలాఖరులో షూటింగ్‌ మొదలు కాబోతోంది. ప్రస్తుతం చెన్నైలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ విషయాల్ని దర్శకుడే తాజా ఇంటర్వ్యూలో కన్‌ఫర్మ్‌ చేశాడు. కేజీయఫ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సమాచారం. ఇక ఎప్పటి నుంచో ఆగిపోయిన ’ధృవనక్షత్రం’ మూవీ కూడా త్వరలో సెట్స్‌కి వెళ్లబోతోంది. రీసెంట్‌గా విక్రమ్‌ని దర్శకుడు గౌతమ్‌ విూనన్‌ కలవడంతో ఈ విషయం బైటికొచ్చింది. ఎప్పుడో 2017లో మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఇంతవరకు పూర్తి కాలేదు. తానెంతో ఇష్టపడిన మూవీ కావడంతో విక్రమ్‌కి దీనిపై ప్రేమ పోలేదు. ఎలాగైనా కంప్లీట్‌ చేసి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆ సమయం ఇప్పటికి వచ్చింది. మిగిలిన పోర్షన్‌ని షూట్‌ చేసేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా పూర్తి చేసి, నెక్ట్స్‌ ఇయర్‌ ప్రారంభంలో మూవీని రిలీజ్‌ చేయాలని ఎª`లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈసారైనా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మంచిదే మరి!