పిచ్చికుక్క స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,మార్చి30(జ‌నంసాక్షి):  మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు బుధవారం ఉదయం రెచ్చిపోయాయి. సంజయ్‌నగర్‌, పోస్టాఫీస్‌ ఏరియా, రాఘవేంద్రనగర్‌, శ్రీ నగర్‌ ప్రాంతాల్లో కనిపించిన వారిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 22 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ముగ్గురి విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌ కు తరలించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది స్థానికుల సహకారంతో ఒక పిచ్చికుక్కను అంతం చేశారు. మరో రెండు కుక్కలు తప్పించుకుని పోగా, వాటి కోసం గాలింపు చేపట్టారు.