పిస్టల్‌ స్వాధీనం : ముగ్గురి అరెస్ట్‌

వరంగల్‌ : అక్రమ వసూళ్లకు  పాల్పడుతున్న ముగ్గురిని భూపాలపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 9 ఎం ఎం పిస్టల్‌ స్వాధీనం చేసుకున్నారు. వారు పిస్టల్‌తో బెదిరించి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.