‘పీఆర్సీ’ ప్రకటనను ఉపసంహరించుకోవాలి – ప్రభాకర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 18: పీఆర్సీ డబ్బులు చెల్లింపుల్లో బాండ్లు జారీ చేస్తామన్న ప్రకటనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాండ్ల జారీలో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నందున ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకతప్పదన్నారు.