పుటాన్ దొడ్డి గ్రామంలో యువరైతు మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 7 : మండల పరిధిలోని పుటాన్ దొడ్డి గ్రామంలో యువరైతు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కోదండపురం ఏఎస్సై అయ్యన్న, కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కురువ పరశురాముడు వయస్సు 38 సం మంగళవారం భార్య జయలక్ష్యంతో కలిసి తన వ్యవసాయ పొలంలో కలుపు నివారణ మందుని పిచికార చేశారు. పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి కుటుంబ సమేతంగా భోజనం చేసి నిద్ర పోయారు. ఉదయం నిద్రలోనుంచి లేకపోవడంతో కుటుంబ సభ్యులు పరుశురాముడుని నిద్ర లేపేందుకు ప్రయత్నించగా అప్పటికి ఛాతి నొప్పితో బాధపడుతూ ఉండడాన్ని గమనించి కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏ ఎస్సై తెలిపారు. భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతునికి కుమారుని తోపాటు కూతురు ఉన్నట్లు తెలిపారు. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు మిన్నంటాయి. అలాగే మృతిని కుటుంబ సభ్యులను స్థానిక సర్పంచ్ స్వాతి పరామర్శించి ప్రభుత్వం ఆర్థిక పరంగా ఆదుకోవాలని ఆమె కోరారు.