పునరావస కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే పాయం,

జూలై 14(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ముంపు ప్రాంత ప్రజలకు ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య సందర్శించారు.
పునరావాస కేంద్రంలోని ప్రజలను కలుసుకొని మందుల పంపిణీ, మెరుగైన వైద్యం, భోజనం సకాలంలో అందుతుందా లేదా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ మార్పులకు ప్రజలందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరదల కారణం వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్యులు వైద్య చికిత్సలు ప్రజలకు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకుడు భజన ప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.