పునరావాస కేంద్రాన్ని సందర్శించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

బూర్గంపహాడ్ జూలై 12(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం కస్తూరిబా గాంధీ పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని స్థానిక జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతమైన బూర్గంపహాడ్ గ్రామంలో ముంపునకు గురైన లోతట్టు ప్రాంత ప్రజలను పాఠశాలలో పునరావాసం, వారికి భోజన వసతి జడ్పీటీసీ శ్రీలత, అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ వివేక్ రాం, ఎంపీఒ సునీల్ శర్మ, ఎస్ఐ జీవన్ రాజు, స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, పిఆర్ఏఈ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ ఏ ఈ మునిల్ పాషా, పంచాయతీ సిబ్బంది,
తహసీల్దార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు