పెంచిన డీజిల్‌ పెట్రోల్‌ ధరలకు నిరసనగా రాస్తారోకో

చిలుకూరు: డీజిల్‌, పెట్రోల్‌ ధర పెంపునకు నిరసనగా చిలుకూరు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం కోదాడ, హుజూర్‌నగర్‌ రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదికి ఆరుసార్లు నిత్యావసరాలు, పెట్రోల్‌, డీజిల్‌ పై అదనపు భారాలు మోపి పేదల నడ్డి విరగ్గొడుతుందని సీపీఐ జిల్లా నాయకులు గనా చంద్రశేఖర్‌, జిల్లా గీత సంఘం అధ్యక్షుడు కొండా కోటయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకోలో సీపీఐ మండల కార్యదర్శి నంద్యాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.