పెనుబల్లి నుండీ నీలాద్రి కి భక్తి శ్రద్ధలతో స్వాములు పాదయాత్ర

పెనుబల్లి,నవంబర్7(జనం సాక్షి)
శ్రీ మణికంఠ అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో కార్తీక సోమవా రాన్ని పురస్కరించుకొని పెనుబల్లి నుండి స్వాములు నీలాధ్రి దేవస్థానానికి కాలినడకన చేరుకున్నారు, గురుస్వామి మోదుగుమూడి మాధవరావు స్వామి ఆధ్వర్యంలో శరణు ఘోష ఓం నమశివాయ శరణాలు ఆలకిస్తూ పెనుబల్లి గ్రామం నుంచి అయ్యప్పలు, సాయిబాబాలు, ఆంజనేయ మాల ధారణ స్వాములు, భక్తులు సుమారు400 మంది స్వాములు నీలాద్రి వరకు మహాపాదయాత్ర భక్తి శ్రద్ధలతో ప్రారం భించారు, ఈ సంధర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కనగాల వెంకటరావు ఈ యాత్రలో స్వాములతో కలిసి పాదయాత్ర లో పాల్గొన్నారు, అనంతరం నీలాద్రి దేవస్థానంలో స్వాములు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం నాగుల నాగేశ్వర స్వామి, మిల్క్ స్వామి వారి ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్ర మాన్నీ నిరహించారు.