పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండ- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 18, (జనంసాక్షి )
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం అయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 9 మంది లబ్ధిదారులకు ₹ 3’53,500 మంజూరయ్యాయని అన్నారు. గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆయా పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే అందించేవి అని, సామాన్యుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందని ద్రాక్ష లా మిగిలి పోయెదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చి పేదల ఆరోగ్యానికి బాసటగా నిలిచి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆరెఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.