పేదల మనిషి పీజేఆర్‌

జనం గుండెల్లో ఆయన స్థానం పదిలం: సీఎం
హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) :
పేదల కోసం జీవితాంతం పనిచేసిన మహామనిషి పి. జనార్దన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన 65 జయంతిని శనివారం నగరంలోని ఖైరతాబాద్‌లో నిర్వహించారు. పేదల గుండెల్లో ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారని తెలిపారు. ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా పీజేఆర్‌ అక్కడ ఉండేవారని తెలిపారు. ఆయన సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వ అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటు సాగించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
జాతీయ విపత్తుల నివారణ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ, పీజేఆర్‌ ఎల్లవేలళలా ప్రజలకు అందుబా టులో ఉండే నేతని కొనియాడారు. కార్య క్రమంలో మంత్రులు గీతారెడ్డి, శ్రీధర ్‌బాబు, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.