పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్- నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్ అని నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో 88 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన సర్పంచ్ సునిగంటి సిద్దులు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్ ఎంతో అండగా ఉంటుందని అన్నారు. ఆసరా పింఛన్ ఎంపికలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ‌ నిజమైన లబ్ధిదారులు ఇంకా వందకు పైగా ఉన్నారని వారికి త్వరగా పెన్షన్లు మంజూరయ్యారా అధికారులు చోరవ చూపాలన్నారు. పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో చిన్న చిన్న కారణాలతో వారివి రిజెక్ట్ అయ్యారని వాటిని కూడా పరిశీలించి మంజూరు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీకి కార్యదర్శి లక్ష్మి నరసింహ,గ్రామ పంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : నర్కడలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందజేస్తున్న సర్పంచ్ సునిగంటి సిద్దులు.
Attachments area