పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి.

* డాక్టర్ సంజీవయ్య.
( జనం సాక్షి) పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డీసీ హెచ్ ఎస్ డాక్టర్ ఆకుల సంజీవయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సామాజిక హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు ఫైళ్లను పరిశీలించి తగు సూచనలు సలహాలు చేశారు. అనంతరం పలు వార్డులలో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. కార్యక్రమంలో చిట్యాల సీఎచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ జీడీ తిరుపతి , అనస్థీషియా డాక్టర్ శ్రీకాంత్,గైనకాలజిస్ట్ ప్రవళిక, డ్యూటీ డాక్టర్ మాధవి, హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సిబ్బంది అందరూ పాల్గొన్నారు